Chenethatv, HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.
మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది
చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు
గుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP శోభారాణితో సహా 11 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నాయి.