గాజాస్కూల్‌పైఇజ్రాయెల్బాంబుదాడి, 39 మందిమృత్యువాత

Chenetha TV- Gaza news: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భీకర దాడుల్లో గురువారం మరో విషాదకర ఘటన నమోదయింది. గాజాలో పాఠశాల నిర్వహిస్తున్న ఓ షెల్టర్‌ పై ఇజ్రాయెల్ బలగాలు బాంబు దాడులు జరిపాయి. ఈ ఘటనలో కనీసం 39 మంది మృత్యువాతపడినట్టుగా తెలుస్తోంది. 07.06.2024 తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.  ఐదుగురు స్కూల్ విద్యార్థులు సహా కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునని స్థానిక హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలపై ఈ దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *