స్కావెంజర్ల వేతనాలను వెంటనే చెల్లించాలి, డిటిఎఫ్

ChenethaTV_Scavenger’s salries should be paid immediately

ChenethaTV- Sircilla news: స్కావెంజర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కలెక్టర్ ని కోరింది. ప్రభుత్వము ఆదేశాల ప్రకారము 2024-25 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించుకోవడం జరిగింది. వారందరూ కూడా బడుగు, బలహీన, పేద వర్గాల వారే. వారికి పది నెలల వేతనము ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. ఆ మేరకు కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు పూర్తిగా,  మరికొన్ని జిల్లాల్లో పాక్షికంగా 6,7 నెలల వేతన చెల్లింపు జరిగింది. కానీ మన జిల్లాలో కేవలము 45 రోజుల వేతనం మాత్రమే చెల్లించడం చాలా బాధాకరం.  ఈ విషయంగా డిటిఎఫ్ గతంలో నే కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేసి ఉన్నది.  కానీ ఏ విధమైన ఫలితం లేకపోవడంతో 24.04.2025 న మరొకసారి కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ రెడ్డి ని కలిసి స్కావెంజర్ల మిగతా వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది.  ఆ మేరకు కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కలెక్టర్ వెంటనే సహృదయతతో  స్పందించి వారి వేతనాలను విడుదల చేయాలని డిటిఎఫ్ పక్షాన కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో అసలు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దొంతుల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి అవురం సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తడక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *