
ChenethaTV- Yellareddypet news: ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రములో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కోవత్తుల ర్యాలీ పాకిస్తాన్ తీవ్రవాదుల దిష్టి బొమ్మ దహనం. కాశ్మీర్ లోని పహల్గాం కి విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోంది. ఇప్పటికే చిప్ప చేత పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుమాలిన చర్య. భారత ప్రభుత్వం నుండి దీనికి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి కుటంబాలకు, ప్రగాఢ శ్రదాంజలి గడిస్తుతున్నాం. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.